తెలంగాణ

telangana

By

Published : May 8, 2020, 11:53 AM IST

ETV Bharat / state

విశాఖ ఘటన... సింగరేణి అప్రమత్తం

విశాఖ గ్యాస్​ లీక్​ ఘటనతో తెలంగాణలోని అన్ని రంగాల పరిశ్రమలు అప్రమత్తమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని సింగరేణి ఉపరితల గనిని డైరెక్టర్​ ఆఫ్​ మైన్స్​ సేఫ్టీ జీవీ రంగారావు సందర్శించారు.

mines safety director ranga rao visited yellandu singareni
విశాఖ ఘటన... సింగరేణి అప్రమత్తం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని సింగరేణి ఉపరితల గనిని డైరెక్టర్ ఆఫ్ మైన్స్​సేఫ్టీ జీవీ రంగారావు సందర్శించారు. రోజువారీగా వినియోగించే యంత్రాలను, డోర్స్ డంపర్ డ్రెస్సులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.

ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ రంగారావు అధికారులకు సూచించారు. రక్షణ చర్యలు చేపడుతూనే పనులు నిర్వహించాలని ఆదేశించారు. డైరెక్టర్ వెంట.. ఏజెంట్​ వెంకటేశ్వర్లు, ఏఎస్​ఓ శ్రీనివాస్, మేనేజర్ రామస్వామి, ప్రాజెక్టు ఇంజినీర్ ప్రభాకరరావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details