తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మానుష్యంగా మణుగూరు రోడ్లు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో లాక్​డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మణుగూరులో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఉదయం ఆరు నుంచి 10 గంటలలోపే నిత్యావసరాల కోసం జనం బయటకు వచ్చారు. తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగే వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

lock down at manuguru, manuguru lock down
మణుగూరులో లాక్​డౌన్, కరోనా వేళ లాక్​డౌన్ అమలు

By

Published : May 12, 2021, 3:49 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో లాక్​డౌన్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కోసం జనం బయటకు వచ్చారు. అనంతరం దుకాణాలు మూసేశారు. ఈ క్రమంలో పట్టణ రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మణుగూరు ఏఎస్పీ పి.శబరీష్, సీఐ భానుప్రకాశ్​లు లాక్​డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు.

నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుంటున్నారు. అనవసరంగా రోడ్లపై సంచరించే వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని ఏఎస్పీ ఆదేశించారు.

ఇదీ చదవండి:అలా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి!

ABOUT THE AUTHOR

...view details