భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తూరుబాక గ్రామంలో లక్ష్మీదేవి జాతరలో ఆదివాసీలు భారీగా పాల్గొన్నారు. జోగ వంశీయుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీలు నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర శుక్రవారం ప్రారంభమైంది. నేటితో ముగియనుంది.
తూరుబాక గ్రామంలో ఘనంగా లక్ష్మీదేవి జాతర - లక్ష్మీదేవి జాతర తూరుబాక గ్రామం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తూరుబాక గ్రామంలో లక్ష్మీదేవి జాతరను ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. జోగ వంశీయుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఆదివాసీల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
![తూరుబాక గ్రామంలో ఘనంగా లక్ష్మీదేవి జాతర laxmidevi jaathara at thurubaka village in bhadradri kothagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11098264-1047-11098264-1616320833126.jpg)
తూరుబాక గ్రామంలో ఘనంగా లక్ష్మీదేవి జాతర
కార్యక్రమంలో పినపాక, ఇల్లందు నియోజకవర్గం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు.
ఇదీ చూడండి: అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం