తెలంగాణ

telangana

ఇల్లెందు పట్టణ సమస్యలను మంత్రి కేటీఆర్​కు విన్నవించిన హరిప్రియ

దశాబ్దాలుగా పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా అన్ని గృహాలను సర్వే చేసి అర్హులందరికీ యాజమాన్య హక్కులు కల్పించాలని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ.. మంత్రి కేటీఆర్​ను కోరారు. హైదరాబాద్​ ప్రగతిభవన్​లో సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

By

Published : Sep 29, 2020, 7:15 AM IST

Published : Sep 29, 2020, 7:15 AM IST

ఇల్లెందు పట్టణ సమస్యలపై మంత్రి కేటీఆర్​కు విన్నవించిన ఎమ్మెల్యే హరిప్రియ
ఇల్లెందు పట్టణ సమస్యలపై మంత్రి కేటీఆర్​కు విన్నవించిన ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లెందు పట్టణంలోని అన్ని గృహాలను సర్వే చేసి అర్హులందరికీ ఇంటి యాజమాన్య హక్కు కల్పించాలని ఎమ్మెల్యే హరిప్రియ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​కు విన్నవించారు. ప్రగతిభవన్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన శాసన సభ్యులు, మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​... మంత్రి కేటీఆర్​తో సమావేశమయ్యారు.

ఇల్లందు పట్టణంలో జీవో నెంబరు 76 కింద సర్వే బృందాలను వెంటనే ఏర్పాటు చేసి పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఈ జీవో ప్రకారం 2014 వరకు నివాసం ఏర్పరుచుకున్న వారికి మాత్రమే నిబంధన ఉందని... దీని వలన ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా నిబంధనలు మార్పుచేసి దరఖాస్తు గడువు పెంచాలని విన్నవించారు. కార్యక్రమంలో మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్​మెంట్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రజల ఆస్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details