భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ప్రముఖ ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస రావు(వాసు) కరోనాతో మృతి చెందడంతో ఆయన అంతిమ సంస్కారాలను అన్నం ఫౌండేషన్ నిర్వహించింది. పారా లీగల్ వాలంటీర్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇల్లందు పురపాలక ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పీపీఈ కిట్ ధరించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఇల్లందు పట్టణంలో దశాబ్దాలుగా ప్రైవేటు విద్యాసంస్థల్లో భాగస్వామి, ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శ్రీనివాసరావు.. గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. కొవిడ్ నిబంధనలతో అన్నం ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించింది.