తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2020, 1:28 PM IST

Updated : Oct 8, 2020, 2:03 PM IST

ETV Bharat / state

సంక్షేమంలో అగ్రగామిగా తెలంగాణ: ప్రభుత్వ విప్‌ కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల్ని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అందజేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతి పేదింటికి పెద్దన్న అయ్యారని కొనియాడారు.

kalyana lakshmi and shaadi mubarak cheques were distributed in bhadradri kothagudem district
సంక్షేమంలో తెలంగాణ ముందుంది: ప్రభుత్వ విప్‌ కాంతారావు

సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని ఆయన పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా సీఎం కేసీఆర్ ప్రతి పేదింటికి పెద్దన్న అయ్యారని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో రాష్ట్రంలో ప్రతి ఇల్లు సంతోషంగా ఉందన్నారు.

పథకాల అమలులో తెలంగాణ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా కేసీఆర్ పాలన కొనగిస్తున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి:తొలి చిత్రంతోనే 'నంది' గెలుచుకున్న నటి ఈమె

Last Updated : Oct 8, 2020, 2:03 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details