భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పాత మార్కెట్ ఎదురుగా గల మైదానాన్ని జేడీ ఫౌండేషన్ అధ్యక్షులు లక్ష్మీ నారాయణ పట్టణ ప్రజలతో కలిసి శుభ్రం చేశారు. భద్రాచలాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని చాలా నెలలుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా... ఇవాళ మైదానంలో ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. స్థానిక వాకర్స్తో... కలిసిశుభ్రపరిచారు. ప్రపంచంలోనే ప్లాస్టిక్ను నిషేధించిన పట్టణంగా భద్రాచలం తీర్చిదిద్దాలని సంకల్పంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ప్లాస్టిక్ను నిషేధించి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని పట్టణాన్ని స్వచ్ఛ భద్రాచలంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛ భద్రాచలంగా మార్చేద్దాం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ - cbi jd lakshmi narayana
భద్రచలంలోని పాత మార్కెట్ ఎదురుగా గల మైదానాన్ని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అక్కడి వాకర్స్తో కలిసి శుభ్రం చేశారు. భద్రాద్రిని స్వచ్ఛ భద్రాచలంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛ భద్రాచలంగా మార్చేద్దాం: జేడీ లక్ష్మీనారాయణ