భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఐసోలేషన్ హోమ్ క్వారంటైన్ కేంద్రాన్ని ఏరియా జనరల్ మేనేజర్ సత్యనారాయణ పరిశీలించారు. సింగరేణి ఉద్యోగులకు కరోనా వైరస్ చికిత్స అందించేందుకు ముందస్తుగా 20 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఒకవేళ ఎవరైనా కరోనా బారిన పడితే అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్న ఈ ఐసోలేషన్ హోం క్వారంటైన్ కేంద్రంలోనే ఉద్యోగులు చికిత్స పొందాలని సూచించారు.