తెలంగాణ

telangana

ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన రజత్​కుమార్​ - సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించి రజత్​కుమార్​

సీతారామ సాగునీటి ప్రాజెక్టును నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్​ కార్యదర్శి రజత్​కుమార్ సందర్శించారు. నిర్మాణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన రజత్​కుమార్​
IRRIGATION DEPARTMENT PRINCIPAL SECRETARY RAJATH KUMAR VISITED SEETHARAMA PROJECT

By

Published : Feb 22, 2020, 5:24 PM IST

Updated : Feb 22, 2020, 7:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో జరుగుతున్న సీతారామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రజత్ కుమార్ పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో అశ్వాపురం చేరుకున్న రజత్​కుమార్ అధికారులతో కలిసి దుమ్ముగూడెం ఆనకట్ట, సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

30రోజుల్లో సీతారామ ప్రాజెక్టు ట్రయల్​రన్​ నిర్వహించేందుకు కృషిచేస్తున్నట్లు రజత్​కుమార్​ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని... వాటన్నిటినీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అనంతరం భారజల కర్మాగారం అతిథిగృహంలో రాష్ట్రంలో నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై రజత్​కుమార్ సమీక్షాసమావేశం నిర్వహించారు.

సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన రజత్​కుమార్​

ఇదీ చూడండి :మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

Last Updated : Feb 22, 2020, 7:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details