తెలంగాణ

telangana

అక్టోబర్ 5, 6 తేదీల్లో ఆందోళన నిర్వహిస్తాం

By

Published : Sep 30, 2020, 8:36 AM IST

Updated : Sep 30, 2020, 9:05 AM IST

సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెం వద్ద అక్టోబర్ 5, 6 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఐఎన్​టీయూసీ నాయకులు త్యాగరాజు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంగళవారం ఐఎన్​టీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేశారు.

intuc protest will be held on October 5th and 6th at Kothagudem
అక్టోబర్ 5, 6 తేదీల్లో ఆందోళన నిర్వహిస్తాం

అక్టోబర్ 5, 6 తేదీల్లో సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెం వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఐఎన్​టీయూసీ నాయకులు త్యాగరాజు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంగళవారం ఐఎన్​టీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఏరియా జీఎం సత్యనారాయణకు తమ డిమాండ్లను తీర్చాలని వినతిపత్రం అందించారు.

అక్టోబర్ 5, 6 తేదీల్లో ఆందోళన నిర్వహిస్తాం

మార్చి నెలలో కార్మికుల నుంచి మినహాయించిన 50% జీతాన్ని ఈనెల చెల్లించాలని ఐఎన్​టీయూసీ నేతలు కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. 2019, 20 ఏడాదికి 35 శాతం బోనస్​ దసరాకు ముందుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ కారణంగా ఇంట్లో ఉండి చికిత్స పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఎన్​టీయూసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు

Last Updated : Sep 30, 2020, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details