తెలంగాణ

telangana

ETV Bharat / state

జనజీవన స్రవంతిలోకి మహిళా మావోయిస్ట్ - charla mandal rallapuram

భద్రాచలం ఏఎస్పీ ఎదుట ఓ మహిళ మావోయిస్టు సభ్యురాలు లొంగిపోయింది. మావో జీవితంపై విరక్తి చెందడం వల్లే జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు ఆమె తెలిపారు.

Into the mainstream .. Woman Maoist
జనజీవన స్రవంతిలోకి .. మహిళ మావోయిస్ట్

By

Published : Dec 24, 2020, 10:50 PM IST

Updated : Dec 25, 2020, 12:22 AM IST

మావోయిస్ట్ దళ సభ్యురాలు మడివి అడిమే లొంగిపోయినట్లు భద్రాచలం ఏఎస్పీ డా. వినీత్ తెలిపారు. చర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన అడిమే.. 2016 నుంచి మావోయిస్ట్ దళంలో పనిచేస్తుట్లు ఆయన తెలిపారు. అనేక సార్లు పోలీసు వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పారితోషకాన్ని ఇప్పించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

జనజీవన స్రవంతిలోకి రండి

మావోయిస్టు జీవితంపై విరక్తి చెందడం వల్లే జనజీవన స్రవంతిలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. మిగతా సభ్యులు కూడా దండ కారణ్యాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

ఇదీ చదవండి:'కేసీఆర్​ వల్లే కరెంటు, సాగునీటి కష్టాలు తీరినయ్'

Last Updated : Dec 25, 2020, 12:22 AM IST

ABOUT THE AUTHOR

...view details