తెలంగాణ

telangana

By

Published : May 1, 2020, 12:34 PM IST

ETV Bharat / state

30 టన్నుల కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

లాక్​డౌన్​ కష్టకాలంలో ఇల్లందు ఎమ్మెల్యే తన దాతృత్వాన్ని చాటుతూ... నిరుపేద ప్రజలకు ఈ రోజు 30 టన్నుల కూరగాయలను పంపిణీ చేశారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడం వల్ల పార్టీ శ్రేణులంతా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

MLA HARIPRIYA DISTRIBUTED VEGITABLES
30 టన్నుల కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ మొత్తం 30 టన్నుల కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 36 పంచాయతీల్లో 200 నుంచి 300 కుటుంబాలకు ఆ కూరగాయలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే హరిప్రియ జన్మదినం కావడం వల్ల కార్యకర్తలు, పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి:తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే...

ABOUT THE AUTHOR

...view details