కట్టుకున్న భార్యపై ఓ భర్త కత్తితో దాడిచేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారవుపేట మండలంలోని ఓట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఓట్లపల్లిగ్రామానికి చెందిన నాగరాజు అదే గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
2 రోజుల క్రితం భార్యతో గొడవపడిన నాగరాజు తన తల్లి వద్దకు వెళ్లి భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి పథకం ప్రకారమే అతిగా మద్యం తాగి కత్తి పట్టుకుని భార్య వద్దకు వెళ్లాడు. భోజనం పెట్టమని వెంకటలక్ష్మిని అడిగాడు. దీనితో వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమె మెడపై వేటు వేశాడు.