తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే.. - భద్రాచలం వార్తలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. గత నెలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలతో ఈసారి ఆదాయం పెరుగుతుందని భావించినా.. పెద్ద మార్పేమీ కనిపించలేదు.

hundi counting at bhadrachalam lord srirama temple
భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే..

By

Published : Feb 5, 2020, 8:47 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తైంది. గత నలభై ఆరు రోజుల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి అభరణాలను లెక్కించారు.

రూ. 73 లక్షల 38 వేల 315 నగదు, 60 గ్రాముల బంగారం, ఆరు వందల గ్రాముల వెండి కానుకలు వచ్చాయి. 467 అమెరికా డాలర్లు, మలేషియాకు చెందిన 3 రింగెట్స్​​తో పాటు పలు దేశాల నగదు కానుకగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా.. హుండీ ఆదాయం పెరగవచ్చని అధికారులు భావించారు. ఎప్పటి మాదిరిగానే ఆదాయం వచ్చింది.

భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే..

ఇవీచూడండి:మేడారంలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details