భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణవాసులకు శుభవార్త. పట్టణంలో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును పెంచాలని మున్సిపల్ ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వర్లు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకులంగా స్పందించారు. గడువు పెంచేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని... దీనిపై తర్వలో తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు అభినందనలు తెలిపారు.
ఇల్లందులో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పెంపు - Illandu Latest News
ఇళ్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ఇల్లందు పట్టణ వాసులకు అవకాశం కల్పించాలన్న మున్సిపల్ ఛైర్మన్ చేసిన విజ్ఞప్తికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సానుకులంగా స్పందించారు. గడువు పెంచేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
![ఇల్లందులో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పెంపు Houses Regulation deadline increased in Illandu city in Bhadradri kothakugem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7380407-1089-7380407-1590658078265.jpg)
ఇల్లందులో క్రమబద్ధీకరణ గడువు పెంపు
పట్టణంలో ఇప్పటి వరకు 40 శాతం మంది మాత్రమే క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కొంత మందికి అవగాహన లేక చేసుకోలేక పోయారని మరో అవకాశం ఇస్తే 100% గృహ యజమానులు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీనివలన పురపాలక సంఘానికి ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు.