తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 2:23 PM IST

ETV Bharat / state

హనుమాన్​ జయంతిపై కరోనా ప్రభావం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్​ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సింగరేణి మణుగూరు ఏరియా జీఎం రమేశ్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

hanuman jayanthi celebrations in manuguru in bhadhradri kothagudem district
హనుమాన్​ జయంతిపై కరోనా ప్రభావం

ప్రతి ఏడాది హనుమాన్​ జయంతి వేడుకలకు సందడిగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఈ ఏడాది కరోనా వల్ల బోసిపోయింది. లాక్​డౌన్​ నిబంధనలు అమల్లో ఉండటం వల్ల హనుమాన్​ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.

సింగరేణి మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్ దంపతులు, వర్క్​షాప్​ డీజీఎం నర్సిరెడ్డిలు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details