తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంలో వరిగడ్డి ట్రాక్టర్​ దగ్ధం

విద్యుదాఘాతంతో వరిగడ్డి లోడ్​తో ఉన్న ట్రాక్టర్​ దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలం రామచంద్రునిపేట వద్ద చోటుచేసుకుంది.

By

Published : Feb 13, 2020, 1:58 PM IST

fire accident at ramachandrunipeta in bhadradri kothagudem district
విద్యుదాఘాతంలో వరిగడ్డి ట్రాక్టర్​ దగ్ధం

విద్యుదాఘాతంలో వరిగడ్డి ట్రాక్టర్​ దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన రైతు నల్లబోతుల రాంబాబు వరిగడ్డి లోడ్​తో ఉన్న ట్రాక్టర్​ను తీసుకెళ్తున్నాడు. రామచంద్రునిపేట వద్ద విద్యుత్​తీగలు తగిలి వరిగడ్డికి మంటలు అంటుకున్నాయి.

కొన్ని క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించి గడ్డితో సహా ట్రాక్టర్​ దగ్ధమైంది. గడ్డికి మంటలు అంటుకోగానే డ్రైవర్​ ట్రాక్టర్​ దిగి పక్కకు వెళ్లిపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.

ఇవీ చూడండి: కోటి విలువగల బంగారం పట్టివేత... ఆరుగురి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details