తెలంగాణ

telangana

ETV Bharat / state

వీధిదీపాలు అమర్చుతూ స్తంభంపైనే మృతి... - CRIME NEWS IN TELANGANA

వీధిదీపాలు అమర్చుతున్న ఓ విద్యుత్​ కార్మికుడు... విద్యుదాఘాతంతో స్తంభంపైనే మృతి చెందాడు. ఈ విషాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుబ్బంపేటలో జరిగింది.

ELECTRICITY EMPLOYEE DIED ON POLL WITH CURRENT SHOCK

By

Published : Nov 21, 2019, 11:45 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సుబ్బంపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ పనుల్లో భాగంగా కరెంట్ స్తంభాలకు వీధిదీపాలు అమర్చుతున్న కారం రాజు విద్యుదాఘాతంతో స్తంభంపైనే మరణించాడు. ఒక్కసారిగా విద్యుత్​ ప్రసారమై ప్రమాదం సంభవించింది. మృతదేహం కరెంటు స్తంభంపైనే ఉండటం వల్ల.... తోటి కార్మికులు తాడు సహాయంతో కిందకు దించారు. విషయం తెలిసిన రాజు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

వీధిదీపాలు అమర్చుతూ స్తంభంపైనే మృతి...

ABOUT THE AUTHOR

...view details