ప్రశాంతంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ - ప్రశాంతంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ప్రశాంతంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తం 5 జడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇప్పటికే 14 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా.. అందులో 12 తెరాస అభ్యర్థికి, ఒకటి కాంగ్రెస్ అభ్యర్థికి, మరొకటి స్వతంత్ర అభ్యర్థికి వచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.