భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. కొత్తగూడెంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ను ప్రారంభించిన అనంతరం... గుండాల స్టేషన్ను సందర్శించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన కర్తవ్యమన్నారు.
మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డీజీపీ - కొత్తగూడెంలో ఫైరింగ్ రేంజ్ను ప్రారంభించిన డీజీపీ
తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన కర్తవ్యమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన... కొత్తగూడెంలో పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ను ప్రారంభించారు.
![మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డీజీపీ dgp mahendar reddy inaugurate police parade ground and firing range in kothagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9979638-314-9979638-1608720045536.jpg)
మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డీజీపీ
పోలీసు నియామకాల్లో గ్రామీణ యువతకు ప్రాధాన్యత కల్పించేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మహేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రాన్ని శాంతియుత ప్రాంతంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'