తెలంగాణ

telangana

సారపాకలో ఆదివాసీలకు నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా అడవిలో నివసిస్తున్న ఆదివాసి వలస కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక దగ్గరలోని అటవీప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు టీఎన్టీయూసీ నాయకులు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

By

Published : May 12, 2020, 1:02 PM IST

Published : May 12, 2020, 1:02 PM IST

daily essentials distribution to migrants at sarapaka by tntuc leaders
సారపాకలో ఆదివాసీలకు నిత్యావసర సరుకుల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి వలస కుటుంబాలకు టీఎన్టీయూసీ నాయకులు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఛత్తీస్​ఘడ్​ నుంచి వచ్చిన 30 వలస కుటుంబాలు.. కరోనా నేపథ్యంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

వీరికి సాయం అందించేందుకు టీఎన్టీయూసీ నాయకులు ముందుకు వచ్చి... వారందరికీ బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని... లాక్​డౌన్​ నిబంధనలను పాటించాలని సూచించారు.

ఇదీ చదవండిఃహైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details