గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రాద్రి దివ్యక్షేత్రం భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. భక్త రామదాసు ఆలయం నిర్మించినప్పటి నుంచి పూజల్లో, అలంకారాల్లో, ఉత్సవాల్లో ఎలాంటి లోటు రాలేదు. ఈసారి మాత్రం కరోనా వైరస్ ప్రభావం వల్ల స్వామివారికి ఘనంగా జరగాల్సిన కార్యక్రమాలు నామమాత్రంగా జరిగాయి.
అలంకరణలు లేకుండా ఉత్సవాలు
సీతారాములు వనవాస కాలంలో రెండున్నరేళ్ల పాటు భద్రాద్రి ప్రాంతంలో గడపడం ఇక్కడి పుణ్యక్షేత్రం గొప్పదనం. భద్రాద్రిలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన ఎదుర్కోలు, సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు మాత్రమే మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించి... పుష్పాలతో పూజలు చేశారు. మిగతా ఉత్సవాలన్నీ ఎలాంటి అలంకరణలు లేకుండా జరిపిస్తున్నారు.
మిగిలిపోనున్న ముత్యాల తలంబ్రాలు