తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2020, 10:15 AM IST

ETV Bharat / state

కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు

కరోనా వైరస్​ బారినపడి మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సైతం భయపడుతున్నారు. అలాంటి తరుణంలో కొందరు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మాత్రం కరోనా బాధితుల అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Corona was the public representative who conducted the funeral for the dead
కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కరోనాతో మృతి చెందిన ఇద్దరికి పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ నవీన్ ఆధ్వర్యంలో అంతక్రియలు నిర్వహించారు. వైద్యుల సూచనలతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రజాప్రతినిధుల బాధ్యతాయుత చర్య పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీచూడండి.. పరీక్షల వాయిదాకు నేడు​ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

ABOUT THE AUTHOR

...view details