తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2021, 10:15 AM IST

ETV Bharat / state

భద్రాచలంలో భారత్​ బంద్​ ప్రశాంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారత్​ బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాన రహదారిపై వామపక్ష, ప్రతిపక్ష నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పెట్రోల్ బంకులు, వ్యాపార దుకాణాలు అన్నింటిని నిలిపివేశారు.

Bharat Bandh, bhadrachalam
Bharat Bandh in bhadrachalam

రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి వామపక్ష, ప్రతిపక్ష నాయకులు ఆర్టీసీ బస్టాండ్​లోని బస్సులను బయటికి వెళ్లకుండా ఆపేశారు.

ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని... ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపేయాలని నాయకుడు డిమాండ్​ చేశారు. పెట్రోల్ బంకులు, వ్యాపార దుకాణాలు అన్నింటిని నిలిపివేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరోమారు భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details