భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. లాక్డౌన్కు ముందు 16 రోజులు స్వామివారికి భక్తులు సమర్పించిన ఆదాయాన్ని గణించారు. కొవిడ్- 19 నిబంధనలు పాటిస్తూ చిత్రకూట మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ముందుగా నోట్ల కట్టలకు, నాణేలకు శానిటేషన్ చేశారు. అనంతరం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని నగదుపై పిచికారి చేశారు. ఆలయ సిబ్బంది అంతా మాస్కులు ధరించి చేతులకు శానిటైజర్ రాసుకుంటూ నియమాలు పాటించారు.