తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​కు ముందు 16 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు - భద్రాద్రి జిల్లా తాజా వార్తలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో లాక్​డౌన్​కు ముందు 16 రోజుల భక్తుల కానుకలను లెక్కించారు. నోట్లకు, నాణేలకు శానిటేషన్​ చేసి.. తర్వాత సోడియం హైపో క్లోరైడ్​ ద్రావణాన్ని చల్లారు. ఆలయ సిబ్బంది మాస్కులు ధరించడం, చేతులకు శానిటైజర్​ రాసుకుంటూ.. కరోనా నిబంధనలు పాటించారు.

లాక్​డౌన్​కు మందు 16 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు
లాక్​డౌన్​కు మందు 16 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు

By

Published : Jun 10, 2020, 4:59 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. లాక్​డౌన్​కు ముందు 16 రోజులు స్వామివారికి భక్తులు సమర్పించిన ఆదాయాన్ని గణించారు. కొవిడ్- 19 నిబంధనలు పాటిస్తూ చిత్రకూట మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ముందుగా నోట్ల కట్టలకు, నాణేలకు శానిటేషన్ చేశారు. అనంతరం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని నగదుపై పిచికారి చేశారు. ఆలయ సిబ్బంది అంతా మాస్కులు ధరించి చేతులకు శానిటైజర్ రాసుకుంటూ నియమాలు పాటించారు.

16 రోజులకు గాను నగదు 27 లక్షల 52 వేలు 536 వచ్చింది. కొన్ని విదేశీ కరెన్సీ స్వామివారికి కానుకలుగా రాగా.. వెండి బంగారు ఆభరణాలు ఏమి రాలేదు. ఆలయ ఈవో నరసింహులు ఈ లెక్కింపును పర్యవేక్షించారు.

ఇవీ చూడండి:10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details