భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో కూడారై ఉత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాసం నెలంతా గోదాదేవి వ్రతాన్ని ఆచరించిన మహిళలు ఈరోజు కూడారై ఉత్సవాన్ని నిర్వహించారు.
కృష్ణుని ఆలయంలో ఘనంగా కూడారై ఉత్సవం - bhadradri kothgudem district latest news
రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కూడారై ఉత్సవం కల్యాణ సన్నిధిలో వైభవంగా జరిగింది. మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. భజనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోయింది.
![కృష్ణుని ఆలయంలో ఘనంగా కూడారై ఉత్సవం bhadradri kudarai festival in bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10200284-922-10200284-1610359058650.jpg)
కృష్ణుని ఆలయంలో ఘనంగా కూడారై ఉత్సవం
108 గంగాళాల్లో.. పరమాన్నాన్ని వండి స్వామివారికి నైవేధ్యంగా సమర్పించారు. అనంతరం కృష్ణుని భక్తి గీతాలు ఆలపిస్తూ.. మంగళ హారతులు పాడారు. భజనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, శ్రీ కృష్ణ సేవా సమితి మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం