భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో జిల్లా పాలనాధికారి అనుదీప్ పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న పొలం వద్ద ఆగి... కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇంటింటికీ కాలినడకన
అనంతరం మండలంలోని భట్టుపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కాలినడకన పర్యటించి ప్రతి ఇంటినీ పరిశీలించారు. గృహ సముదాయాల మధ్య నీరు నిల్వ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందని... గ్రామ సర్పంచి, కార్యదర్శి ప్రతి ఇంటికీ వెళ్లి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.