తెలంగాణ

telangana

ETV Bharat / state

కూర్మావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య - తెలంగాణలో ఆలయాల సమాచారం

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజున సీతారామచంద్ర స్వామి కూర్మావతారంలో దర్శనమిచ్చారు.

కూర్మావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య
కూర్మావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

By

Published : Dec 16, 2020, 7:53 PM IST

Updated : Dec 16, 2020, 10:38 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్నారు. స్వామివారు బుధవారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాజ భోగం అనంతరం స్వామి వారిని మేళ తాళాలు నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. కరోనా కారణంగా స్వామివారి తిరువీధి సేవలు, తీర్థ ప్రసాదం రద్దు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 25 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు.

అవతార విశిష్టత..

పూర్వకాలంలో దేవ దానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని చిలుకుతున్న క్రమంలో మందర పర్వతం దిగిపోతుండగా.. దేవతల అభ్యర్థనపై శ్రీ మహావిష్ణువు కూర్మావతారమెత్తి పర్వతాన్ని పైకి లేపారు. ఈ అవతారంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల శని గ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు.

ఇదీ చూడండి:ముగ్గురు తెలంగాణ పోలీసులకు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అవార్డులు

Last Updated : Dec 16, 2020, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details