భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గత 41 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా నేడు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సమ్మె శిబిరం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేకు ప్రజా సంఘాలు వ్యాపార సంస్థలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు భద్రాచలం డివిజన్లోని కాంగ్రెస్ నాయకులు, తెదేపా నాయకులు, సీపీఎం, సీపీఐ న్యూ డెమోక్రసీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భద్రాచలం ఎమ్మెల్యే నిరాహార దీక్ష - latest news of tsrtc protest
భద్రాద్రికొత్తగూడెం జిల్ల భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భద్రాచలం ఎమ్మెల్యే ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేకు పలు ప్రజా సంఘాల నేతలు.. ఉపాధ్యాయ, వ్యాపార సంస్థలు సంఘీభావం తెలిపాయి.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భద్రాచలం ఎమ్మెల్యే నిరాహార దీక్ష
ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులు అడుగుతున్నవే న్యాయబద్ధమైన డిమాండ్లని ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. 41 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఉద్యోగులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భద్రాచలం ఎమ్మెల్యే నిరాహార దీక్ష
ఇదీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా