కొత్తగూడెంలో పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయి బాలోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్...వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక పోటీలు... మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో పోటీలు కొనసాగుతున్నాయి.
పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లోని విద్యార్థులు హాజరయ్యారు. పోటీలను ప్రారంభించిన చంద్రశేఖర్... విద్యార్థుల్లో కళా తృష్ణను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయన్నారు. మరింత మెరుగైన నైపుణ్యాలను సాధించేందుకు ఇలాంటి పోటీలు అవకాశం కల్పిస్తాయని స్పష్టం చేశారు.
కొత్తగూడెంలో బాలోత్సవ్... ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్ - కొత్తగూడెంలో బాలోత్సవ్... ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్
పాఠశాల విద్యార్థులకు కొత్తగూడెం జిల్లాలో ఘనంగా బాలోత్సవ్ సంబురాలు ప్రారంభమయ్యాయి. వేడుకలకు హాజరైన సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్... సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సానబెడతాయన్నారు.
కొత్తగూడెంలో ఘనంగా బాలోత్సవ్ ప్రారంభం