భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం తోటపల్లి గ్రామ శివారులోని పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి... వారి నుంచి 46 వేల రూపాయల నగదుతో పాటు... 23 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై దాడులు... ఏడుగురు అరెస్ట్ - పేకాట స్థావరంపై దాడులు
పేకాట స్థావరంపై దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి... 46 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్న ఘటన ఇల్లందు మండలం తోటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![పేకాట స్థావరంపై దాడులు... ఏడుగురు అరెస్ట్ attacks-on-a-poker-site-and-seven-members-arrest-at-yellandu-in-badhradi-kothagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8211635-thumbnail-3x2-poker.jpeg)
పేకాట స్థావరంపై దాడులు... ఏడుగురు అరెస్ట్
పట్టుకున్న వాహనాలను ట్రాక్టర్లలో పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల రాకను కొందరు గమనించి అక్కడి నుంచి పారిపోయారు. వారి గురించి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఇదీ చూడండి:టూర్స్ అండ్ ట్రావెల్స్: షెడ్డులకే వాహనాలు.. తప్పని కష్టాలు