తెలంగాణ

telangana

By

Published : Jan 1, 2020, 8:38 PM IST

ETV Bharat / state

ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది!

మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమంటారు. చావును ఎవరూ ఆపలేమంటారు. అదే నిజమైంది ఇక్కడ. రోడ్డు పక్కన ఆగి ఉన్న స్కూటీని ఓ ప్రైవేట్​ అంబులెన్స్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ఏళ్ల పాపతోపాటు మహిళ మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక క్రాస్​ రోడ్​లో జరిగింది.

accident-in-badradri-kothagudem-district
accident-in-badradri-kothagudem-district

ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక క్రాస్ రోడ్​లో ఆగి ఉన్న స్కూటీని ఓ ప్రైవేటు అంబులెన్స్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళతోపాటు 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. భద్రాచలంలోని భూపతి రావు కాలనీకి చెందిన చంద్రిక(28) తన అమ్మతో పాటు ఐదేళ్ల అక్క కూతురు శ్రీ లాస్య (5)ను తీసుకురావడానికి ఏపీలోని పాములేరు వెళ్లింది.

చలి కోటును బయటకు తీసేలోపే

తిరిగి వస్తున్న క్రమంలో లాస్యకు చలి వేస్తుండగా సారపాక సమీపంలో రోడ్డు పక్కన స్కూటీ ఆపిన చంద్రిక అమ్మ బ్యాగ్​లోంచి చలి కోటును బయటకు తీసుకునే క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన అంబులెన్స్​ ఢీకొట్టింది. చంద్రిక, లాస్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో అంబులెన్స్​ డ్రైవర్​కు గాయాలు కాగా చంద్రిక అమ్మ ప్రాణాలతో బయటపడ్డారు.

ఇవీ చూడండి: బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే..

ABOUT THE AUTHOR

...view details