తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్కా మోసం

ప్రభుత్వ కొలువులు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వలపన్నారు. డిగ్రీ పాసైన విద్యార్థుల నుంచి సుమారు రూ.56 లక్షలు వసూలు చేశారు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యారు.

By

Published : Feb 25, 2019, 5:16 PM IST

Updated : Feb 25, 2019, 9:50 PM IST

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం
భద్రాచలం చర్లకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి జల్సాలకు అలవాటుపడి అడ్డదారులు వెతికాడు. అందుకు మురుమూరుకు చెందిన మరో యువకుడితో జతకట్టాడు. ఇద్దరూ కలసి నిరుద్యోగులకు సింగరేణి కంపెనీలో కొలువులు ఇప్పిస్తామంటూ ప్రచారం చేశారు. భద్రాచలం, చర్ల, కొత్తగూడెం ప్రాంతాల్లోని కొందరు యువకుల నుంచి సుమారు రూ.56 లక్షలు వసూలు చేశారు. ఆ నగదుతో జల్సాలు చేయడం మొదలెట్టారు.

పాపం పండిందిలా

డబ్బులిచ్చి ఎంతకాలమైనా ఉద్యోగం రాకపోవడంవల్ల అనుమానమొచ్చిన యువకులు నిందితులిద్దరిపై భద్రాచలం ఠాణాలో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితులు సోయం ప్రసాద్​, చర్ల నాగేంద్ర ప్రసాద్​ హైదరాబాద్​ వెళ్తుండగా బస్టాండులో కాపుకాసి చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రెండు కార్లు, విద్యార్థుల ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారిని తొందరలోనే పట్టుకుంటామని భద్రాచలం సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

Last Updated : Feb 25, 2019, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details