తెలంగాణ

telangana

ETV Bharat / state

శాంతించిన గోదారమ్మ... 52.5 అడుగులకు చేరిన నీటిమట్టం - Decreased Godavari latest news

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిన గోదావరి శనివారం శాంతించింది. భద్రాచలం వద్ద వరద 52.5 అడుగులకు చేరడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

53.2 feets Decreased Godavari water level at Bhadrachalam
శాంతించిన గోదారమ్మ

By

Published : Aug 22, 2020, 9:43 AM IST

Updated : Aug 22, 2020, 2:33 PM IST

భదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి కాస్త శాంతించింది. శుక్రవారం వరకు 52.5అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం రాత్రి నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఉదయం ఆరు గంటలకు 52.5అడుగుల వద్ద ప్రవహిస్తోంది.

సుమారు రెండు అడుగుల మేర తగ్గడం వల్ల స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 52.5అడుగుల కంటే తగ్గితే అధికారులు ఈ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవాలన్నారు. గోదావరి ఉద్ధృతికి భద్రాచలంలోని ఏజెన్సీ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవీచూడండి:పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు

Last Updated : Aug 22, 2020, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details