సిద్దిపేట మండలం బండ చర్లపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపడుతోన్న మినీ డ్యామ్ (1 టీఎంసీ) నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. డ్యామ్ కారణంగా.. వ్యవసాయ భూములతో పాటు తమ గ్రామం కూడా ముంపునకు గురయ్యే ప్రమాదముందంటూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
మొదట డ్యామ్ నిర్మాణం చేపట్టే స్థలం ఓ చోట అని చెప్పి.. ఇప్పుడు మరోచోట పనులు ప్రారంభిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. తమకెలాంటి సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.