తెలంగాణ

telangana

నూతన ఉపాధ్యాయులతో డీఈఓ కార్యాలయంలో సందడి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో  టీఆర్టీ ఎస్జీటీల కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. తొలిరోజు మైదాన ప్రాంతంలో 256 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

By

Published : Oct 29, 2019, 10:01 AM IST

Published : Oct 29, 2019, 10:01 AM IST

ఆదిలాబాద్​లో సందడిగా మారిన డీఈఓ కార్యాలయం

నిరుద్యోగుల రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. చదువే పెట్టుబడిగా కష్టపడి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు పలువురు ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో టీఆర్టీ ఎస్జీటీల కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. డీఆర్వో నటరాజ్, డీఈవో రవీందర్ రెడ్డి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులంతా తరలి రావడం వల్ల డీఈఓ కార్యాలయం సందడిగా మారింది. తొలిరోజు మైదాన ప్రాంతంలో 256 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగం సాధించిన ఆనందాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

ఆదిలాబాద్​లో సందడిగా మారిన డీఈఓ కార్యాలయం
ఇదీ చదవండిః 'నిమ్స్​ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా

ABOUT THE AUTHOR

...view details