బస్తీమే సవాల్: ఆదిలాబాద్ జిల్లాలో తెరాస విజయదుందుభి - telangana municipal election polling 2020
ఆదిలాబాద్ జిల్లాలో పురపాలిక ఎన్నికల్లో తెరాసనే అధికార పీఠం దక్కించుకుంది. జిల్లాలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో తెరాస జెండా ఎగిరింది.
![బస్తీమే సవాల్: ఆదిలాబాద్ జిల్లాలో తెరాస విజయదుందుభి trs-won-in-adilabad -district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5839457-780-5839457-1579954040596.jpg)
బస్తీమే సవాల్: ఆదిలాబాద్ జిల్లాలో తెరాస విజయదుందుబి
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పురపాలికలో 49 వార్డులు ఉండగా... తెరాస 24 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా 11, కాంగ్రెస్ 05, ఎంఐఎం 05, ఇతరులు 04 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఆదిలాబాద్లో తెరాస ఛైర్మన్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంది. దీనితో జిల్లాలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.