తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైరస్ విస్తరిస్తుంది... మైసమ్మ జాతరను రద్దు చేద్దాం' - కరోనా వ్యాప్తి

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో వైరస్ విస్తరణ ఎక్కువగానే ఉంది. తాజాగా జిల్లాలో ఏడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 23కు చేరింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరగాల్సిన మైసమ్మ జాతరను రద్దు చేశారు.

total-corona-cases-in-adilabad-district
'వైరస్ విస్తరిస్తుంది... మైసమ్మ జాతరను రద్దు చేద్దాం'

By

Published : Jul 19, 2020, 10:38 AM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి దీని భారీన పడే వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఏడు కేసులు నమోదు కాగా... నిర్మల్ జిల్లాలో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 23 మంది బాధితులు ఉండగా... నిర్మల్ జిల్లాలో 28మంది చికిత్స పొందుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 59 చేరింది. మరో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో కరోనా నేపథ్యంలో మైసమ్మ జాతరను రద్దు చేశారు.

ఇదీ చూడండి:20 నిమిషాల్లోనే కరోనాను గుర్తించే రక్త పరీక్ష

ABOUT THE AUTHOR

...view details