తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరుల త్యాగం అజరామరం: గంప - telangana formation day in adilabad

తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా ఆదిలాబాద్​లో అవతరణ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు.

telangana formation day celebrations in adilabad
తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాళి

By

Published : Jun 2, 2020, 11:59 AM IST

ఆదిలాబాద్​లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిపారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి మొక్కలు నాటారు.

అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. కలెక్టరేట్​లో గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన, ఎస్పీ విష్ణువారియర్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్ బాపూరావు, జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్ధన్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details