కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా - ఉపాధ్యాయ సమస్యల పై ఎస్టీయూ ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు.

ఉపాధ్యాయ సమస్యల పై ఎస్టీయూ ధర్నా
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనీర్ల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకటించాలని, టీఆర్టీ నియామకాలు చేపట్టాలని, సీపీఎస్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని... లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
ఉపాధ్యాయ సమస్యల పై ఎస్టీయూ ధర్నా