ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న చాంద(టి) గ్రామం భావితరాలకు బాటలు వేస్తూ ఆదర్శ గ్రామంగా ముందడుగు వేస్తోంది. నిజాం కాలంలోనే గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయడంతో యువకులు ఉన్నత చదువుల వైపు సాగారు. 1960లో గ్రామానికి చెందిన ఆరె బాపురావు ‘'డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్’'గా మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. ఆయన ప్రోత్సాహంతోనే అనతి కాలంలోనే చాలా మంది వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ కొలువులు సాధించిన వారు ఆ గ్రామం నుంచి 260 మందికి పైగా ఉన్నారు. అందులో ఉపాధ్యాయులే 55 మంది ఉంటారు. 38 మంది పోలీసు శాఖలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తుండగా ఇద్దరు వైద్యులుగా సేవలు చేస్తున్నారు. 60 మంది పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్న వారు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నారు. గ్రామానికి చెందిన ఆరె శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ప్రాణాంతక వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించే వారు మరో 10 మంది ఉన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు 50కి పైగా ఉన్నారు. వీరంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే కావడం విశేషం.
సంఘంగా ఏర్పడి.. గ్రామాభివృద్ధికి తోడ్పాటు
సొంతూరికి ఉపకారం చేయాలనే సంకల్పంతో చాంద(టి)లోని ఉద్యోగులంతా కలిసి ‘మిత్ర పూర్వ విద్యార్థుల సంఘం’ ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. ప్రస్తుత పాఠశాలకు రూ.2 లక్షలతో మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం గ్రామం నుంచి ఉన్నత స్థానంలో ఉన్న వైద్యులతో ముఖాముఖి, వ్యక్తిత్వ వికాస నిపుణలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఏటా అంతా కలిసి చేయాల్సిన పనుల గురించి చర్చిస్తారు.
సొనాల.. ఎందరికో స్ఫూర్తి..