లాక్డౌన్ తొలి రోజునే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని రేషన్ దుకాణాల్లో సర్వర్ సమస్య తలెత్తింది. ఉదయం 6 గంటలకే డీలర్లు దుకాణాలు తెరవగా... పెద్ద ఎత్తున జనాలు రేషన్ బియ్యం కోసం చేరుకున్నారు. ఈ పాస్ యంత్రంలో సర్వర్ సమస్య తలెత్తడం వల్ల బియ్యం పంపిణీ నిలిచిపోయింది.
సర్వర్ సమస్యతో బియ్యం పంపిణీలో జాప్యం - ఆదిలాబాద్ రేషన్ దుకాణాల్లో సర్వర్ సమస్య
ఆదిలాబాద్ జిల్లాలోని పలు రేషన్ దుకాణాల్లో సర్వర్ సమస్య తలెత్తడం వల్ల కార్డుదారులు దుకాణాల ఎదుట పడిగాపులు కాయాల్సి వచ్చింది.
సర్వర్ సమస్యతో బియ్యం పంపిణీలో జాప్యం
మూడు గంటల పాటు కార్డుదారులు పడిగాపులు కాయగా... తొమ్మది గంటల తర్వాత సమస్య తీరింది. బియ్యం పంపిణీ ప్రారంభమైంది.