సమత కేసు విచారణ రేపటికి వాయిదా - సమత కేసు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
![సమత కేసు విచారణ రేపటికి వాయిదా Samatha case Postponed to tomorrow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5501176-728-5501176-1577361567021.jpg)
సమత కేసు విచారణ రేపటికి వాయిదా
సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసులో సాక్షుల విచారణ జరిగింది. ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టుకి కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితుల్ని తీసుకొచ్చారు. ఈ నెల 23, 24న 2రోజుల పాటు న్యాయస్థానం కేసును విచారించింది. నేడు మరోసారి సాక్షుల్ని విచారించారు. అదనపు పీపీ రమణారెడ్డి 9 మంది సాక్ష్యులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నిందితుల తరఫున న్యాయవాది రహీం... సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇరు వైపులా వాదనలు విన్నారు. కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.
సమత కేసు విచారణ రేపటికి వాయిదా