తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డుప్రమాదంతో అక్రమ రవాణా గుట్టురట్టు

ఓ రోడ్డు ప్రమాదం పశువుల అక్రమ రవాణాను బయటపెట్టింది. ఈ ఘటనలో 14పశువులు మృతి చెందాయి.

By

Published : Jul 30, 2019, 3:49 PM IST

బోల్తాపడ్డ లారీ

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్ మండలం నిరాల సమీపంలో లారీ, మరో వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14పశువులు మృతి చెందాయి. ఈ ఘటనలో వ్యాన్​ డ్రైవర్‌ మూడు గంటల పాటు ఇరుక్కొని నరకం అనుభవించాడు. రోడ్డు పక్కనున్న పంక్షన్ షాపులోకి వ్యాన్ దూసుకెళ్లడంతో అందులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంతో పశువుల అక్రమ రవాణా బయటపడింది. మహారాష్ట్ర నుంచి మూగజీవాలను తరలిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. లారీని స్థానికులు పట్టుకొని పొలీసులకు అప్పగించారు.

అక్రమ రవాణాను బయటపెట్టిన రోడ్డు ప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details