తెలంగాణ

telangana

ETV Bharat / state

ముథోల్​ నియోజకవర్గంలో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

రెవెన్యూశాఖ రద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలని ముథోల్​ నియోజకవర్గ వ్యాప్తంగా వీఆర్​ఓ, వీఆర్​ఏలు తహసీల్దార్​ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.

By

Published : Sep 18, 2019, 5:18 PM IST

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ఆదిలాబాద్ జిల్లా ముథోల్​ నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్​ కార్యాలయాల ముందు వీఆర్​ఓ, వీఆర్​ఏలు ధర్నా నిర్వహించారు. రెవెన్యూశాఖను రద్దు చేసి పంచాయతీరాజ్​శాఖ, వ్యవసాయశాఖలో విలీనం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. ఎన్నోఏళ్లుగా సేవలందిస్తున్న రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర సర్వే చేసి, భూ రికార్డులను ఆధునీకరించాలని కోరారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ABOUT THE AUTHOR

...view details