తెలంగాణ

telangana

వీఆర్వోపై దాడిని ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ఆదిలాబాద్​ జిల్లా తాంసి మండల కేంద్రంలో వీఆర్వోపై దాడి.. రెవెన్యూ అధికారుల, ఉద్యోగుల నిరసనకు దారితీసింది. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కలెక్టర్​కి ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు.

By

Published : Nov 4, 2020, 2:08 PM IST

Published : Nov 4, 2020, 2:08 PM IST

revenue employees protest against attack on vro in adilabad
వీఆర్వోపై దాడిని ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండల కేంద్రంలో వీఆర్వో రోహిత్‌పై దాడి.. రెవెన్యూ అధికారుల, ఉద్యోగుల నిరసనకు దారితీసింది. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కలెక్టర్​ సిక్తాపట్నాయక్​కు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. అనంతరం రెవెన్యూ సంఘభవన ఆవరణలో నిరసన చేపట్టారు.

తనపై దాడి వెనక స్థానిక రాజకీయనాయకుల ప్రాబల్యం ఉందని వీఆర్వో ఆరోపించారు. రైతులకు దాడిచేయాలనే ఉద్దేశం లేకున్నా నాయకులు వారిని ప్రేరేపించారని అన్నారు. రైతుల సమ్మతంతోనే శెత్వారీ కంటే ఎక్కువ ఉన్న భూమిని తొలగించామని స్పష్టం చేశారు. అయినా తమ భూమి తమకు ఇప్పించాలని గొడవకు దిగినట్లు తెలిపారు.

వీఆర్వోకు న్యాయం జరిగే దాకా అండగా ఉంటామని రెవెన్యూ కార్యదర్శుల సంఘం నాయకులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు... అన్నదాతల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details