తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2019, 2:32 PM IST

ETV Bharat / state

తహసీల్దార్​ మృతికి సంతాపంగా కార్యాలయాలకు తాళాలు

ఆదిలాబాద్​ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి మృతికి సంతాపంగా కార్యాలయాలకు తాళాలు వేసి కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు.

REVENUE EMPLOYEES EXPELLED DUTIES FOR MRO VIJAYAREDDY DEATH

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్​తో సహా తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులు నిరసన తెలిపారు.

ధర్నాకు మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు, ఆధార్ సేవా కేంద్రాలు సైతం మద్దతుగా నిలిచాయి. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనతో కలెక్టరేట్ ఎదుట నిరసన సాగించారు.

తహసీల్దార్​ మృతికి సంతాపంగా కార్యాలయాలకు తాళాలు

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

ABOUT THE AUTHOR

...view details