తెలంగాణ

telangana

By

Published : Sep 28, 2020, 1:54 PM IST

ETV Bharat / state

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా

ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో ఉపాధి లేక ఎంతోమంది అభద్రతా భావంతో చనిపోయారని వాపోయారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా

తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ... ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో ఉపాధి లేక ఎంతోమంది అభద్రతా భావంతో చనిపోయారని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల సుధాకర్ రెడ్డి వాపోయారు.

తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన తమను ఆదుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చూడండి: తెలంగాణలో మరో 1,378 కరోనా కేసులు, 7 మరణాలు

ABOUT THE AUTHOR

...view details