తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ నిషేధాన్ని ఇంటి నుంచే ప్రారంభిస్తాం: విద్యార్థులు - ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం

By

Published : Oct 4, 2019, 8:36 PM IST

ఆదిలాబాద్ పట్టణంలోని ఐటీఐ కళాశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లాస్టిక్​ను ఉపయోగించబోమని నినదించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఇంటి నుంచే ప్రారంభిస్తామని, చుట్టుపక్కల వారికి ఈ మేరకు అవగాహన కల్పిస్తామని ప్రతినబూనారు.

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details