తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డంతా గుంతలమయం.. ప్రసవం అయ్యేదాక భయం భయం.. - pregnants are facing problems in delivery due to no facilities of transport

దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. గ్రామాల అభివృద్ధి మాత్రం వెనుకబడే ఉంది. ఇప్పటికీ కొన్ని ఊళ్లకు రోడ్డు సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గర్భిణీలకు ప్రసవం అయ్యే వరకు దినదిన గండంగా గడపాల్సి వస్తుంది. రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రసవానికి వెళ్లేటప్పుడు మార్గమధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తోంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు ఇంటి దగ్గరే ప్రసవం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితే ఆదిలాబాద్​ జిల్లా తుమ్మలపాడులో చోటుచేసుకుంది.

pregnants are facing problems
బాలింతల సమస్యలు

By

Published : Jul 26, 2021, 2:03 PM IST

ఆ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడం, అటువైపు 108 వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. మార్గమధ్యలోనే అంబులెన్స్​ సిబ్బంది.. ఊళ్లోకి వెళ్లి నిండు గర్భిణీకి ప్రసవ వేదన తీర్చారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం తుమ్మల పాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గర్భిణీ పూజ తాయికి ఉదయం నుంచే పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఊళ్లోకి వాహనం వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కిలోమీటరు దూరంలోనే అంబులెన్స్​ ఉంచి.. సిబ్బంది ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఈఎంటీ కాశీనాథ్, పైలెట్ గోపీనాథ్​లతో పాటు కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను వైద్యం నిమిత్తం కిలోమీటరు దూరం ఎడ్లబండి సహకారంతో తీసుకెళ్లారు. అక్కడినుంచి 108 వాహనంలో ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.

ఎడ్లబండిలో అంబులెన్స్​ వరకూ బాలింతను తరలిస్తున్న 108 సిబ్బంది

తప్పని వేదన

ఏళ్లుగా కనీస రహదారికి నోచుకోక పోవడంతో గ్రామస్థుల ఇబ్బందులు తీవ్రతరం అయ్యాయి. ప్రభుత్వం మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించకపోవడంతో ఎంతో మంది మాతృమూర్తులకు ఈ వేదన తప్పడం లేదు. 108 సిబ్బంది సహకారంతో తమకు ఇబ్బంది తీరిందని.. అత్యవసర సమయంలో తమకు అండగా నిలిచారని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:NEW RATION CARDS: రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

ABOUT THE AUTHOR

...view details